బైక్ ను ఢీకొన్న కారు.. నలుగురికి గాయాలు

64చూసినవారు
కంచిలి మండలం జలంతరకోట జంక్షన్ సమీప జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొని అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన లో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులతో పాటు ద్విచక్రవాహనదారునికి తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనంలో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ రాజేష్ తెలిపారు.

సంబంధిత పోస్ట్