తెలుగుపత్రికకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చి పెట్టిన అక్షరయోధుడు రామోజీరావుని నరసన్నపేట రచయితల వేదిక అధ్యక్షులు సదాశివుని కృష్ణ అన్నారు. సోమవారం నరసన్నపేటలో జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యదర్శి, కథా రచయిత భమిడిపాటి గౌరిశంకర్ మాట్లాడుతూ ప్రతిభకు తాను ఐదు సంవత్సరాలు పాఠాలు రాశానని, తన కథలను విపుల, తెలుగు వెలుగు, బాలభారతం పత్రికలలో ప్రచురించారన్నారు.