ఉత్తరప్రదేశ్లోని గణతంత్ర దినోత్సవం రోజున హాపూర్ జిల్లా సిఖేడా గ్రామంలో తిరంగా యాత్రలో వెళుతుండగా ఓవర్లోడ్ నిండిన చెరకు ట్రక్కు బైక్ను ఢీకొని హైవేపై బోల్తాపడడంతో సాకిబ్ అనే విద్యార్థి మరణించాడు. ఈ ఘటనలో ఇద్దరు
విద్యార్థులు సోను, అమీర్ సహా ముగ్గురు
విద్యార్థులు గాయపడ్డారు. గాయపడ్డవారిని స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పరారయ్యాడని సమాచారం. దీంతో పిల్లల కుటుంబంలో కన్నీటి ఛాయలు అలముకున్నాయి.