వైసీపీ కార్యకర్తలపై టీడీపీ దాడులు: వైసీపీ
AP: నంద్యాల జిల్లాలో వైసీపీ కార్యకర్తలపై టీడీపీ దాడులు చేసిందని వైసీపీ మండిపడింది. జిల్లలోని కొలిమిగుండ్ల మండలం బెలుం సింగవరం గ్రామంలో వైసీపీ కార్యకర్త హరి, ఆయన భార్య తిరుపతమ్మపై టీడీపీ వర్గీయులు కట్టెలతో దాడి చేశారని తెలిపింది. ఈ దాడిలో భార్యభర్తలకు తీవ్ర గాయాలయ్యాని పేర్కొంది. పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి వారిని తరలించారని వివరించింది.