TDP, YCP మధ్య చిచ్చుపెట్టిన వృద్ధురాలి మృతి (వీడియో)
కృష్ణా జిల్లా గంగూరులో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పెన్షన్ కోసం వెళ్లిన వజ్రమ్మ (80) వడదెబ్బ తగిలి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దాంతో టీడీపీ నేత బోడే ప్రసాద్, వైసీపీ నేత జోగి రమేశ్ వజ్రమ్మ ఇంటికి పరామర్శించేందుకు వెళ్లారు. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పర ఆరోపణలకు దిగారు. వృద్ధురాలి మృతికి చంద్రబాబే కారణమంటూ వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.