మంత్రి కొల్లు రవీంద్రకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. క్రిమినల్ కేసులతో సంబధం లేకుండా రవీంద్ర పాస్ పోర్ట్ను పునరుద్ధరించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 20వ తేదిన మంత్రి విదేశాలకు వెళ్తుండటంతో వెంటనే క్లియర్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. తన పాస్పోర్టును పునరుద్ధరించాలని పాస్పోర్ట్ అధికారులను గతంలో రవీంద్ర కోరారు. అయితే రవీంద్రపై క్రిమినల్ కేసులు ఉండటంతో పాస్ పోర్ట్ అధికారులు నిరాకరించారు.