AP: చిత్తూరు జిల్లాలో ఆరేళ్ల బాలిక మిస్సింగ్ ఘటన విషాదాంతంగా ముగిసింది. పుంగనూరుకు చెందిన ఆరేళ్ల బాలిక ఆదివారం నుంచి కనిపించకుండా పోయింది. దీనిపై బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. 11 బృందాలతో గాలించారు. ఎక్కడా బాలిక ఆచూకీ లభించలేదు. బుధవారం పుంగనూరు సమ్మర్ స్టోరేజ్లో ఆరేళ్ల బాలిక మృతదేహం కనిపించింది. చిన్నారి మృతిపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.