ఏపీ కేబినెట్లో ముగ్గురు మహిళలు వీరే!
![ఏపీ కేబినెట్లో ముగ్గురు మహిళలు వీరే!](https://media.getlokalapp.com/cache/ef/b7/efb7a89a7fc21117b52a2ac325074eda.webp)
ఏపీ కేబినెట్లో 24 మంత్రుల్లో ముగ్గురు మహిళలకు చోటు దక్కింది. వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, ఎస్.సవితకు మంత్రి పదవి ఇచ్చారు. వంగలపూడి అనిత.. 2014లో పాయకరావుపేట టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. 2019లో కొవ్వూరు నుంచి ఓడిపోయారు. 2024లో పాయకరావుపేట నుంచి గెలిచారు. ఇక గుమ్మడి సంధ్యారాణి సాలూరు ఎస్టీ నియోజకవర్గం నుంచి గెలిచారు. డిప్యూటీ సీఎం రాజన్న దొరపై 13 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఎస్. సవిత పెనుకొండ బీసీ కురుబ నియోజకవర్గం నుంచి గెలిచారు. మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్పై విజయం సాధించారు.