ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని ప్రజావేదిక నుంచి పర్యటన ప్రారంభించి, ఉద్దండరాయునిపాలెంలోని రాజధాని శంకుస్థాపన ప్రాంతం, సీడ్ యాక్సిస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలు, ఐకానిక్ నిర్మాణాల కోసం పనులు మొదలుపెట్టిన సైట్లను పరిశీలిస్తారు.