
ఎస్ ఆర్ పురం: హైవేపై బోల్తాపడ్డ టాటా ఏస్ వాహనం
గంగాధర నెల్లూరు నియోజకవర్గం, ఎస్ఆర్ పురం మండలంలోని చిత్తూరు -పుత్తూరు జాతీయ రహదారిలోని మేదవాడ సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు మేరకు బంగారుపాలెం నుంచి పల్లిపట్టు వెళ్తున్న మహేంద్ర టాటా ఏస్ వాహనంలో సిమెంట్ బండలు తీసుకు వెళ్తుండగా టైర్ పేలి అదుపుతప్పి బోల్తా పడింది. వాహనంలో ముగ్గురు ఉన్నప్పటికీ ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.