బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన చల్లా బాబు

55చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలోని శక్తి పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్