కులాల మధ్య చిచ్చుపెట్టి పైశాచిక ఆనందం పొందే వ్యక్తి చంద్రబాబు అని రాష్ట్ర వైసీపీ ఎస్సీ అధ్యక్షుడు కల్లూరి చెంగయ్య అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ. రాష్ట్రంలో రెండు లక్షల పైగా ఉద్యోగాలు ఇప్పించిన వ్యక్తి సీఎం జగన్ అన్నారు. బాబు వస్తే జాబు వస్తుందనే మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. దళితులను చూసి ఎందుకు మీకు చదువులు అన్న వ్యక్తి చంద్రబాబు అని అన్నారు.