ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి: డీఎస్పీ
పెళ్లకూరు మండలం శిరసనం బేడు, జీలపాటూరు, చిల్లకూరు గ్రామాల్లో గురువారం నాయుడుపేట డిఎస్పి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని విధాల చర్యలు చేపడుతున్నారు. ఈనెల 13న జరిగే ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని డీఎస్పీ సూచించారు. నాయుడుపేట రూరల్ సీఐ జగన్ మోహన్, ఎస్సై శ్రీకాంత్ సిబ్బంది పాల్గొన్నారు.