సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని నేదురుమల్లి భవనంలో వెంకటగిరి రూరల్, డక్కిలి, సైదాపురం మండలాల వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెంకటగిరి 10 ఏళ్ల టీడీపీ, మరో ఐదేళ్లు మరో ఎమ్మెల్యే వల్ల అభివృద్ధిలో వెనుకబడిందన్నారు.