రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. 13 మందికి గాయాలు
![రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. 13 మందికి గాయాలు](https://media.getlokalapp.com/cache/08/48/084806b49b0e7585c027093518ec05fa.webp)
ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం వేములపాడు వద్ద ఆదివారం ప్రమాదం చోటు చేసుకుంది. ఘాట్రోడ్డులో రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. రెండు బస్సుల్లో ఉన్న 13 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలిస్తున్నారు.