ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం ఏపీకి రానున్నారు. ధర్మవరం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ తరపున ఆయన ప్రచారం చేయనున్నారు. ఇక్కడ జరిగే సభలో అమిత్ షాతో పాటు టీడీపీ చీఫ్ చంద్రబాబు కూడా పాల్గొంటారు. అలాగే కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఇవాళ రాష్ట్రానికి వస్తున్నారు. ఆయన జమ్మలమడుగు, ఆదోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు.