మహిళా చట్టాలు కఠినంగా అమలు చేయాలి

83చూసినవారు
కేంద్రంలో రాష్ట్రాల్లోనూ మహిళా చట్టాలు కఠినంగా అమలు చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) నాయకుడు ఎస్. సోమేశ్ డిమాండ్ చేశారు. ఆదివారం గజపతినగరంలోని నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై కలకత్తాలో వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్యకు ఎస్ఎఫ్ఐ విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. వైద్యురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.

సంబంధిత పోస్ట్