సార్వత్రిక ఎన్నికల్లో తన విజయానికి అందరి సహకారం అవసరమని గజపతినగరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. బుధవారం బొండపల్లి మండలంలోని కొత్తపాలెం, జామి మండలంలోని విజినిగిరి గ్రామంలో జయహో బిసి కార్యక్రమంతో పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బిసి కార్పొరేషన్ ద్వారా బీసీలను ఆదుకుంటామన్నారు. కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.