అనారోగ్యంతో ఏనుగు మృతి

81చూసినవారు
గరుగుబిల్లి మండలం తోటపల్లి గ్రామ సమీపంలో అనారోగ్యంతో మంగళవారం ఆడ ఏనుగు మృతి చెందింది. కురుపాం నియోజకవర్గంలో మొత్తం 7 ఏనుగులు గుంపుగా సంచరిస్తున్నాయి. గత మూడు రోజులుగా గుంపులో ఒక ఆడ ఏనుగు అనారోగ్యంతో నడవలేని స్థితిలో ఉందని గుర్తించి అటవీశాఖ అధికారులు చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో మృత్యువాత పడింది. దాంతో అధికారులు ఏనుగుకు పోస్ట్ మార్టం నిర్వహించి అంత్యక్రియలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్