వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 30 కుటుంబాలు

580చూసినవారు
రాజాం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ రాజయ్య పేట గ్రామంలో బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం జయహో బీసీ కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ పార్టీకి చెందిన 30 కుటుంబాలు తెదేపాలో చేరారు. వీరిని సాదరంగా ఆహ్వానించి తెదేపా పార్టీ కండువాలు వేసారు. చంద్రబాబు రూపకల్పన చేసిన సూపర్ సిక్స్ బీసీ డిక్లరేషన్ లపై ప్రజలు ఎంతో ఆకర్షితులవుతున్నారని కోండ్రు అన్నారు. టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్