గడచిన 15 సంవత్సరాల నుండి మాచేపల్లి ఆశాజ్యోతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ద్వారకామాయి అంధుల పాఠశాలను మూసివేస్తున్నామనే ప్రకటన చూసి ఆవేదన చెందానని, అధికారులు వెంటనే తగిన వసతి కల్పించాలని లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి జిల్లా రెవెన్యూ అధికారి ఎస్. డి. అనితను కోరారు. సోమవారం ఆమెకు వినతిపత్రం అందచేసారు. తక్కువ అద్దెతో పాఠశాల నిర్వహించారని, అద్దె పెంచటంతో మూసివేస్తున్నారన్నారు. ,