సీతానగరం పీహెచ్సి ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా మలేరియా అధికారి
సీతానగరం మండలంలో ఉన్న పీహెచ్సిలో రోగనిర్ధారణ పరీక్షలు సకాలంలో నిర్వహించాలని జిల్లా మలేరియా అధికారి(డిఎంఓ) డాక్టర్ టి. జగన్మోహనరావు ఆదేశించారు. ఆయన సీతానగరం పిహెచ్సి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకున్నారు. జ్వర లక్షణాలతో అప్పుడే అక్కడకు వచ్చిన ఒక పాపకు ల్యాబ్ సిబ్బందిచే నిర్దారణ పరీక్షలు చేయించి వాటి ఫలితాలను పరిశీలించారు.