తాసిల్దార్ పై శాఖా పరమైన చర్యలు చేపట్టాలి

80చూసినవారు
తాసిల్దార్ పై శాఖా పరమైన చర్యలు చేపట్టాలి
గరుగుబిల్లి మండలం శివ్వాం గ్రామ దళితులు కొన్నాళ్ల నుండి సాగు చేసుకుంటున్న సాగు భూములను మండల తాసిల్దార్ పలువురు పెత్తందారులకు అనుకూలంగా పత్రాలు సృష్టించారని సిపిఎం నాయకులు కృష్ణమూర్తి ఆరోపించారు. ఈ మేరకు పార్వతీపురం కలెక్టరేట్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. దళితుల సమస్యలు పరిష్కరించాల్సిన తాసిల్దార్ వారికి అన్యాయం చేయడం తగదని తక్షణమే తాసిల్దార్ పై శాఖా పరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్