చిరంజీవితో గంటా భేటీ
మాజీ మంత్రి, భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు శనివారం మెగాస్టార్ చిరంజీవిని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. చిరంజీవి ఇటీవల పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా రాజకీయాలు, సినిమాలు తదితర అంశాల గురించి ఇద్దరు సుదీర్ఘంగా చర్చించుకున్నారు. తాజా రాజకీయ పరిస్థితులు గురించి చిరంజీవి ఆరా తీశారు.