![మత్స్యకారులకు భద్రత కల్పించండి మత్స్యకారులకు భద్రత కల్పించండి](https://media.getlokalapp.com/cache/7f/8d/7f8d7496b8eda62b9399b8f1391b80df.webp)
మత్స్యకారులకు భద్రత కల్పించండి
అమరావతి సచివాలయంలో మత్స్యశాఖ సెక్రటరీ ఏ. బాబుతో విశాఖకు చెందిన మత్సకార నేత జానకీరామ్ శుక్రవారం భేటీ అయ్యారు. ఇటీవల ఏర్పడిన తుఫాన్ సందర్భంగా గోపాల్ పూర్ పోర్టులోకి విశాఖ ఫిషింగ్ బోట్లను అనుమతించకుండా అక్కడ పోర్టు సెక్యూరిటీ రాళ్లు విసిరారన్నారు. దీంతో మత్స్యకారుల ప్రాణానికి భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.