చోడవరం నియోజవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన కే ఎస్ ఎన్ ఎస్ రాజు భారీ మెజారిటీతో గెలుపొందడంతో సోమవారం చోడవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బానయ్య కోనేరు ప్రజలు ఘనంగా పూలమాలలతో సత్కరించి ఆయన చేతుల మీదగా భారీ కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇచ్చిన మాట ప్రకారం న్యాయం చేస్తానని ఈ సందర్భంగా గుర్తు చేశారు.