ఇండోర్ స్టేడియం ఏర్పాట్లు పరిశీలించిన అయ్యన్న

51చూసినవారు
ఇండోర్ స్టేడియం ఏర్పాట్లు పరిశీలించిన అయ్యన్న
కేంద్రం ప్రకటించిన ఖేలో ఇండియా పథకంలో భాగంగా నర్సీపట్నంలో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు పరిశీలించారు. మంగళవారం సాయంత్రం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ తయారు చేయడానికి వచ్చిన అధికార యంత్రాంగంతో స్థల పరిశీలన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టులో స్పోర్ట్స్ శిక్షణ సంస్థ కూడా ఉంటుందనీ, ఇతర జిల్లాలనుంచి క్రీడాకారులు ఇక్కడకు శిక్షణ పొందే వీలుందన్నారు.

సంబంధిత పోస్ట్