రైతుబజారును వినియోగంలోకి తీసుకురండి

75చూసినవారు
రైతుబజారును వినియోగంలోకి తీసుకురండి
భీమిలి నియోజకవర్గం తగరపువలస సమీపంలో చిట్టివలస రైతు బజార్‌ను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని భీమిలి శాసన సభ్యుడు గంటా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. సత్యనరారాయణ పేట కొండవాలు ప్రాంతాల్లో ఆయన మంగళవారం పర్యటించారు. ఈసందర్భంగా గంటా మాట్లాడుతూ రూ.78లక్షలతో నిర్మించిన రైతుబజారును వెంటనే వినియోగంలోకి తీసుకురావాలన్నారు.

సంబంధిత పోస్ట్