నులిపురుగులతో జాగ్రత్తగా ఉండాలి

83చూసినవారు
నులిపురుగులతో జాగ్రత్తగా ఉండాలి
గాజువాక 87వ వార్డ్ పరిధి వడ్లపూడిలో ఉన్న మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, 87వ వార్డ్ కార్పొరేటర్ బోండా జగన్నాథం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నులిపురుగుల పట్ల ప్రజలు జాగ్రత్తలు వహించాలని. ఇవి ఎక్కువగా పిల్లల శరీరంలో వుంటాయని, వీటి నివారణ కోసం వైద్యులసూచనలు పాటించాలని కోరారు.

సంబంధిత పోస్ట్