విశాఖ ఉక్కును సెయిల్లో విలీనం చేయాలని ఉక్కు పోరాట కమిటీ నాయకులు పరంధామయ్య కోరారు. ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు మంగళవారం నాటికి 1216 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా దీక్షలనుద్దేశించి ఆయన మాట్లాడారు. ఉక్కు సహాయశాఖామంత్రి శ్రీనివాస వర్మ నియమితులు కావడంతో విశాఖ ఉక్కును రక్షించే బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు.