ఆదివాసీ మహాసభ గ్రామమిత్రులకు శిక్షణ
పాడేరు మండలం గబ్బంగి యుత్ ట్రైయినింగ్ సెంటర్ లో ఆదివాసీ మిత్ర వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం మూడు మండలాలు హుకుంపేట, పెదబయలు, పాడేరు ఆదివాసీ మహాసభ గ్రామమిత్రులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివాసీ మిత్ర వెల్ఫేర్ సొసైటీ చీఫ్ ప్రమోటర్ కె, మన్మధరావు మాట్లాడుతూ అటవీ హక్కుల చట్టం, ఉపాధి హామీ చట్టం, గ్రామస్థాయిలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు పై పూర్తిగా అమలు చేసేవిధంగా పని చేయాలని పిలుపునిచ్చారు