ఈనెల 13వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాకు ఇంకా పాఠ్యపుస్తకాలు , యూనిఫారాలు అందలేదు. జిల్లాకు సుమారు మూడు లక్షల పుస్తకాలు అవసరం. పాఠశాలలు ప్రారంభం నాటికే విద్యా కానుకలు అందజేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం మారడంతో విద్యా కానుక అందడం ఆలస్యం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.