మత్స్యకారులను మత్స్యకార భరోసా లబ్ధిదారుల జాబితా నుండి తొలగించడం సరికాదని దీనివల్ల 2,061 మంది మత్స్యకారులు నష్టపోతున్నారని విశాఖ కోస్టల్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బర్రి కొండబాబు ఆవేదన వ్యక్తపరిచారు. వారందరి పేర్లు మళ్ళీ చేర్చాలని మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ విజయకృష్ణకు మంగళవారం వినతిపత్రం అందజేశారు.