మే 10న విశాఖజిల్లా సింహాచలంలోని శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవాన్ని నిర్వహించనున్నట్టు కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. ఈమేరకు గురువారం కలెక్టరేట్లో చందనోత్సవ ఏర్పాట్లపై అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి మేరకే దర్శనాలు కల్పిస్తామన్నారు. ఉదయం 3. 30 నుంచి 4. 30 వరకే అంతరాలయ దర్శనాలుంటాయని, సిటీలోని 10 బ్యాంక్లలో టికెట్ విక్రయాలు జరపనున్నట్టు తెలిపారు.