ఉద్యోగ భద్రత ఇవ్వకపోగా 4000 మంది కాంట్రాక్ట్ సిబ్బందిని విశాఖ ఉక్కు అధికారులు బయటకు వెళ్ళగొట్టడం ఎంతవరకు సమంజసమని ఏయూ విద్యార్థి నాయకుడు సమయం హేమంత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి ఈమేరకు కాంట్రాక్ట్ సిబ్బంది కొనసాగించాలని కోరుతూ విశాఖలో ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం స్పందించి కేంద్రంతో చర్చించి సమస్య పరిష్కరించాలని కోరారు.