ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్న 1199 మంది డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేసినట్టు ఉప రవాణాశాఖ అధికారి రాజారత్నం సోమవారం తెలిపారు. అంతేకాకుండా వీరి లైసెన్స్ను 3 నెలలు సస్పెండ్ చేశామన్నారు. సోమవారం వివిధ ప్రాంతాల్లో వాహన తనిఖీలు నిర్వహించామన్నారు. ఇక పై కూడా ఈ తనిఖీలు కొనసాగుతాయని, వాహనాలపై వెళ్లేవారు కచ్చితంగా హెల్మెట్ ధరించాలన్నారు.