ఆచంట మండలం పెదమల్లం, కోడేరు, వద్ద వశిష్ట గోదావరి వరద పెరుగుతూ తరుగుతూ అటు అధికార యంత్రాంగాన్ని ఇటు లంక గ్రామాల ప్రజలను కలవరపెడుతుంది. గత రెండు రోజులుగా వరద తగ్గుముఖం పట్టి లంక గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్న నేపథ్యంలో బుధవారం నుంచి మళ్లీ గోదావరి ఉధృతి పెరగడం మొదలు పెట్టింది. ప్రస్తుతం కోడేరు పెదమల్లం పర్యటక కేంద్రం, మాచేన్నమ్మ ఆలయం, కరుగోరుమిల్లి, భీమలాపురం పుష్కర ఘాట్ లు నీట మునిగాయి