పెదవేగి మండలం రాట్నాలకుంటలో రాట్నాలమ్మ తల్లి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం అమ్మవారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి. రాట్నాలమ్మను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వారికి అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. పూజ ద్రవ్యాలు, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ. 1, 15, 730 ఆదాయం లభించిందని ఆలయ కార్యనిర్వాహణాధికారి సతీష్ కుమార్ తెలిపారు.