అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు కృషి చేసిన గొప్ప సాంఘిక సంస్కర్త జ్యోతిరావు పూలే అని ఏలూరు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి చంటి అన్నారు. ఈ మేరకు గురువారం ఏలూరులో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూలే అడుగు జాడల్లో నేటి యువత నడవాలని అన్నారు.