బుడమేరు లోతు పరిశీలించే క్రమంలో పడవపై ప్రయాణం చేసిన మంత్రి

74చూసినవారు
బుడమేరు లోతు పరిశీలనలో భాగంగా ఆదివారం పడవపై ప్రయాణించారు రాష్ట్ర జల వనరుల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు. మరో రెండు రోజులపాటు భారీవర్ష సూచనలున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు, నారా లోకేష్ ల ఆదేశాలతో గండ్లు పూడ్చిన ప్రాంతంలో గట్టు ఎత్తు పెంచే పనులను మంత్రి రామానాయుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గట్టుపైనే ఇరిగేషన్ అధికారులు, ఏజెన్సీ లతో సమీక్ష చేసుకుంటూ పనులు వేగవంతంగా పూర్తి అయ్యేలా కృషి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్