గణపవరం( సరిపల్లి) గ్రామంలో సి పి ఎఫ్ ఫ్యాక్టరీ ఏకపక్షంగా మూసివేయడం తగదని సిఐటియు జిల్లా అధ్యక్షులు జే ఎన్ వి గోపాలన్ అన్నారు. కార్మికులు, ఉద్యోగులు చేస్తున్న ధర్నా సోమవారం నాలుగో రోజుకి చేరుకున్నది. ధర్నాకు సిఐటియు నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు గణపవరం మండల అధ్యక్షులు ఎం పెంటారావు, కార్యదర్శి పి గోవింద్, గుత్తుల శ్రీనివాస్, దండు రామలింగరాజు తదితరులు పాల్గొన్నారు.