ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణాలపై వైసీపీ ఫోకస్ పెట్టింది. వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి.. బూతులు తిట్టే నేతలు మీడియా ముందుకు ఎక్కువగా రావడం. ఈ బూతు నేతలే ఓటమికి కారణమని ఆ పార్టీలోనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే పార్టీ తరపున మీడియాతో మాట్లాడే 14 మందితో కూడిన జాబితాను వైసీపీ విడుదల చేసింది.