TDP బెదిరింపులకు YCP బెదరదు: అంబటి
ఏపీలో శాంతిభద్రతలు కాపాడటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. టీడీపీ నేతలే దాడులు చేస్తే వైసీపీ నేతలపై కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. 'వైసీపీ నేతలపై కేసులు పెట్టడమే టీడీపీ పనిగా పెట్టుకుంది. టీడీపీ బెదిరింపులకు వైసీపీ భయపడదు. శాంతిభద్రలపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలి. జగన్ను రోడ్డుపైకి తీసుకువస్తే పరిస్థితి వేరే విధంగా ఉంటుంది' అని హెచ్చరించారు.