యూపీలోని ప్రయాగ్రాజ్లో ఈ ఏడాది జరగనున్న మహా కుంభమేళాకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతుండగా ఘోర ప్రమాదం జరిగింది. 100 అడుగుల ఎత్తైన టవర్ ఒక్కసారిగా కూలిపోయింది. బ్రిడ్జ్ టవర్ కూలి 8 మంది కూలీలు గాయపడగా, ఇద్దరు దాని కింద కూరుకుపోయారు, ఒకరి కాలు తెగిపోయింది. హైటెన్షన్ లైన్ లాగుతుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు.