ఎగ్జిట్ పోల్స్ను ‘కార్పొరేట్ల ఆట’గా శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ కొట్టిపారేశారు. ఇండియా కూటమి 295-310 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేశారు. ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన సంస్థలపై తీవ్ర ఒత్తిడి ఉందని ఆరోపించారు. తమ శివసేన గతంలో సాధించిన 18 సీట్లను నిలబెట్టుకుంటుందని తెలిపారు. యూపీలో ఇండియా కూటమి 35, బిహార్లో ఆర్జేడీ 16 సీట్లు గెలుస్తుందని జోస్యం చెప్పారు.