ఇంటింటికి ఇసుక డెలివరీకి 3 వేల లారీలు

78చూసినవారు
ఇంటింటికి ఇసుక డెలివరీకి 3 వేల లారీలు
ఉచిత ఇసుక విధానంలో భాగంగా వినియోగదారులపై రవాణా ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం 3వేల జీపీఎస్ లారీలను ఏర్పాటు చేసింది. ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్‌ చేసుకున్నప్పుడే.. ఇంటి వద్దకు డెలివరీ కావాలనుకునే వాళ్లు ఆప్షన్‌ ఇస్తే, లారీలో ఇసుక సరఫరా చేయనున్నారు. ఇందులో భాగంగా రీచ్‌లు, స్టాక్‌ పాయింట్ల నుంచి వినియోగదారుల ఇళ్లకు ఇసుక రవాణా చేసేందుకు ఆసక్తి ఉన్న లారీల యజమానులు గనులశాఖ వద్ద రిజిస్టర్‌ చేసుకోవాలని జిల్లాల్లో కలెక్టర్లు ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్