'లఖ్‌పతి దీదీ' పథకం ద్వారా మహిళలు రూ.5 లక్షల రుణం పొందండి

61చూసినవారు
'లఖ్‌పతి దీదీ' పథకం ద్వారా మహిళలు రూ.5 లక్షల రుణం పొందండి
గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల ఆర్థిక సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం ‘లఖ్‌పతి దీదీ’ పథకాన్ని తీసుకొచ్చింది. మహిళలకు వివిధ చిరు వ్యాపారాలపై శిక్షణ, ప్రోత్సాహం అందజేస్తుంది. స్వయం సహాయక సంఘాలు (డ్వాక్రా)లో సభ్యులుగా ఉండి, 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసులో ఉన్న వారు ఈ పథకానికి అర్హులు. ఈ పథకంలో వడ్డీ లేకుండా రూ.5 లక్షల లోన్ పొందొచ్చు. సంబంధిత పత్రాలతో జిల్లాలోని మహిళా శిశు అభివృద్ధి శాఖ కార్యాలయంలో దీనికి దరఖాస్తు చేసుకోవాలి.

సంబంధిత పోస్ట్