ఈశాన్య రాష్ట్రాల్లో వరదలను ఎదుర్కోవడంలో భాగంగా 50 భారీ చెరువులను తవ్వించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశించారు. తద్వారా బ్రహ్మపుత్ర వరదలను మళ్లించవచ్చన్నారు. వర్షాకాలం నేపథ్యంలో నీటి సంరక్షణ, వరదల సమన్నద్ధతపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన.. అత్యాధునిక పర్యవేక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇందుకోసం ఇస్రో అందించే శాటిలైట్ చిత్రాలను సమర్థమంతంగా ఉపయోగించుకోవాలన్నారు.