‘ఏటా 78.5 లక్షల ఉద్యోగాలు అవసరం’
దేశంలో పెరుగుతున్న శ్రామిక జనాభాకు అనుగుణంగా వ్యవసాయేతర రంగంలో ఉపాధి కల్పన జరగాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వేలో తేలింది. 2030 నాటికి ఏటా దేశ ఆర్థిక వ్యవస్థలో 78.5 లక్షల ఉద్యోగాల సృష్టి అవసరమని స్పష్టం చేసింది. పనిచేసే సామర్థ్యం ఉన్నవారందరికీ ఉద్యోగాలు అవసరం లేదని.. వీరిలో కొంతమంది ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో ఉంటారని వ్యాఖ్యానించింది. మరికొందరు స్వయం ఉపాధి పొందే అవకాశం ఉందని తెలిసింది.