ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా వైభవంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో కుంభమేళాకు భారీగా భక్తులు పోటెత్తుతున్నారు. ఈ కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ 8 రోజుల్లో దాదాపు 9 కోట్ల మంది త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అక్కడి సీఎం యోగి సర్కార్ తగిన ఏర్పాట్లు చేస్తోంది.