పెట్రోల్ లీటర్కు రూ.10కి పైగా తగ్గింపు
నగదు కొరత, రెండంకెల ద్రవ్యోల్భణంతో సతమతమవుతున్న పాకిస్థాన్ ప్రజానీకానికి ఊరటనిస్తూ ఈదుల్ అధా (బక్రీద్) పండుగ సందర్భంగా అక్కడి ప్రభుత్వం లీటరు పెట్రోలుపై రూ.10.20, హైస్పీడ్ డీజిల్ (HSD)పై రూ.2.33 మేర తగ్గించింది. శనివారం నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిర్ణయంతో లీటరు పెట్రోల్ ధర రూ.258.16, HSD రూ.267.89గా ఉందని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.